byసూర్య | Fri, Oct 09, 2020, 05:19 PM
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో ఆడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కీలకం కానుంది. తదుపరి విచారణను ఈ నెల 12కు కోర్టు వాయిదా వేసింది. 12 నుంచి రోజువారిగా విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది. కాగా ఈ కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు పలువురు నిందితులుగా ఉన్న విషయం విదితమే.
దేశంలోని ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను సత్వరమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను హైకోర్టు, సీబీఐ కోర్టులు విచారణ షురూ చేశాయి.