byసూర్య | Fri, Oct 09, 2020, 04:00 PM
మంత్రి కేటీఆర్పై ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. సీఎం కేసీఆర్ అధికార నివాసాన్ని మంత్రి కేటీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది. ప్రగతిభవన్ను రాజకీయ కార్యక్రమాలకు వినియోగించొద్దని కాంగ్రెస్ చెబుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారని, వంద డివిజన్లు గెలుస్తామని రాజకీయ ప్రకటన చేశారని తెలిపారు. కేటీఆర్పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.