byసూర్య | Fri, Oct 09, 2020, 03:43 PM
దుబ్బాకలో మంత్రి హరీశ్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి, బొంపల్లి మనోహర్రావు.. హరీష్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ.. దుబ్బాకలో ఓట్లు వేసే వరకే కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ ఇక్కడ ఉంటారని పేర్కొన్నారు. ఓట్లు అయిపోయినా ప్రజల మధ్య ఉండేది తామేనన్నారు. హరీశ్రావు ఎలా పని చేస్తాడో ఉత్తమ్ ప్రజల్ని అడిగి తెలుసుకోవాలన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా రావేమోనని కాంగ్రెస్ ఫ్రస్టేషన్లో ఉందన్నారు. భర్త కోల్పోయిన మహిళను అసమర్థురాలు అని ఉత్తమ్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. దుబ్బాక మహిళా లోకాన్ని ఉత్తమ్ కించపరిచారని హరీశ్రావు పేర్కొన్నారు.