హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్‌లో దారుణం ...

byసూర్య | Fri, Oct 09, 2020, 02:23 PM

భర్తతో తాగుడు మాన్పించాలని ఆస్పత్రికి తీసుకెళ్లిన భార్య డాక్టర్‌తో ఎఫైర్ పెట్టుకుంది. చివరికి ప్రియుడితో కలసి తాగుబోతు భర్తని అమానుషంగా అంతమొందించింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్‌లో చోటుచేసుకుంది. ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కి చెందిన టైలర్ అంజయ్య(57), భవాని దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పక్కరాష్ట్రంలో ఉద్యోగం చేస్తుండగా.. చిన్న కొడుకు స్థానికంగా ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.


మద్యానికి బానిసైన అంజయ్య నిత్యం తాగొచ్చి భార్య, చిన్నకొడుకుని వేధింపులకు గురిచేసేవాడు. భర్త ప్రవర్తన కారణంగా పిల్లలకు పెళ్లిళ్లు కూడా కావడం లేదని భార్య బాధపడేది. భర్తతో ఎలాగైనా మద్యం మాన్పించాలని భావించి ఆయుర్వేద వైద్యుడు సతీష్ కుమార్‌ వద్దకు తీసుకెళ్లింది. అతనితో ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. సెప్టెంబర్ 29న అంజయ్య మద్యం మత్తులో భార్యని తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆగ్రహంతో కట్టలు తెంచుకుంది.


 


ప్రియుడితో కలసి భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు సతీష్ ఇచ్చిన నిద్రమాత్రలు భర్తతో మింగించింది. మత్తులోకి జారుకున్నాక సతీష్ కుమార్‌తో కలసి దిండుతో ఊపిరాడకుండా చేసి అంతం చేసేందుకు యత్నించింది. వెంటనే తేరుకున్న అంజయ్య ఇంట్లో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించడంతో రోకలిబండతో కొట్టి కిరాతకంగా చంపేసింది. వాహనం ఢీకొని దెబ్బలతో ఇంటికి వచ్చి చనిపోయాడని కొడుకుతో సహా అందరినీ నమ్మించింది. పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగి అసలు నిజం బయటపడింది. భార్య, ఆమెకు సహకరించిన సతీష్ కుమార్‌ని పోలీసులు అరెస్టు చేశారు.


 


 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM