byసూర్య | Fri, Oct 09, 2020, 12:07 PM
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డిలో పర్యటించారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో కలిసి స్థానికంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూతులో ఓటింగ్ సరళిని కవిత పరిశీలించారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలతో కవిత ముచ్చటించారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి చేరుకున్న కల్వకుంట్ల కవితకు దారిపొడవునా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.