byసూర్య | Fri, Oct 09, 2020, 12:01 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని రంగారెడ్డి నగర్ చౌరస్తా వద్ద రూ.19.93 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ న ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని జోనల్ కమిషనర్ మమత , స్థానిక కార్పొరేటర్ బి. విజయ్ శేఖర్ గౌడ్ గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం మారుతి నగర్ లో రూ.13.70 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుందన్నారు. ఇచ్చిన హామీలను పూర్తి చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేరుగాంచిందన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిలు మంగతాయారు, రవీందర్ మరియు స్థానిక నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.