హైదరాబాద్ లో ప్రమాదం..యువతి దుర్మరణం

byసూర్య | Thu, Oct 08, 2020, 05:26 PM

హైదరాబాద్ సమీపంలోని గుర్రంగూడ గో కటింగ్ ప్లే జోన్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువతి దుర్మరణం చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలాలు ఇలా ఉన్నాయి. మీర్ పేటకు చెందిన యువతి శ్రీవర్షిణి బీటెక్ ఫైనలియర్ చదువుతుంది. నగర శివారులో ఉన్న గుర్రంగూడలోని గో కటింగ్ ప్లే జోన్ కు మరో యువతితో కలిసి వెళ్లింది. ప్లే జోన్ లో ఉన్న కారులో షికారు చేద్దామనుకుంది. యువకుడు కార్ డ్రైవ్ చేస్తుండగా శ్రీవర్షిణి పక్కకు కూర్చుంది. ప్రమాదవశాత్తు శ్రీవర్షిణి వెంట్రుకలు కారు చక్రంలో చుట్టుకుపోయాయి.


దీంతో హెల్మెట్ ఒక్కసారిగా పక్కకు వెళ్ళిపోయింది. శ్రీవర్షిణి తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మరణించింది. అర్ధరాత్రి సమయంలో గో కటింగ్ కు అనుమతి ఇవ్వడం పైన అటు తల్లిదండ్రులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గో కటింగ్ చేసేటప్పుడు తగిన విధంగా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దీని పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు Thu, Mar 28, 2024, 01:43 PM
జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన Thu, Mar 28, 2024, 01:41 PM
అల్లాపూర్ గ్రామంలో ఇప్పటికీ తీరని నీటి కష్టాలు Thu, Mar 28, 2024, 01:38 PM
గాయత్రి మాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ Thu, Mar 28, 2024, 01:37 PM