ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన యువ‌తి అదృశ్యం..

byసూర్య | Thu, Oct 08, 2020, 02:26 PM

వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం బ‌య‌ట‌కు వెళ్లి వ‌స్తాన‌ని చెప్పి ఇంటి నుంచి బ‌య‌ల్దేరిన ఓ యువ‌తి అదృశ్య‌మైంది. చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంప‌ల్లిలోని శివాజీన‌గ‌ర్ హ‌నుమాన్ దేవాల‌యం వ‌ద్ద నివాసం ఉండే కేతావత్ ప‌ద్మ త‌న సోద‌రి కేతావ‌త్ శ్రీ‌దేవితో క‌లిసి గ‌చ్చిబౌలి టీసీఎస్ కంపెనీలో హౌజ్ కీపింగ్ విభాగంలో ప‌నిచేస్తోంది. కాగా ఈ నెల 6వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీ‌దేవి అనారోగ్యం కార‌ణంగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటాన‌ని చెప్పి న‌వాబ్ పేట హాస్పిట‌ల్‌కు వెళ్తున్న‌ట్లు ఇంట్లో చెప్పింది. అనంత‌రం ఆమె అదే రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో తాను శంక‌ర్‌ప‌ల్లి వ‌ద్ద ఉన్నాన‌ని చెప్పింది. త‌రువాత ఆమె ఫోన్ స్విచాఫ్ అయింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబ స‌భ్యులు ఆమె కోసం అన్ని చోట్లా గాలించినా ఆచూకీ తెలియ‌లేదు. ఈ క్ర‌మంలో వారు చందాన‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


 


 


 


 


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM