byసూర్య | Thu, Oct 08, 2020, 01:05 PM
బేగంబజార్ లోని ఫీల్ ఖానా వద్ద ఉన్న ఓ స్మశానవాటిక నిర్మాణం వివాదస్పదంగా మారింది. మజ్లీస్ నాయకులు కట్టొద్దని, బిజెపి నాయకులు కట్టి తీరుతామని ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. మూత్రశాల నిర్మించేవరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని బిజెపి నాయకులు, వ్యాపారులు బేగంబజార్ బంద్ కు పిలుపునిచ్చారు. బీజేపీ కార్పొరేటర్ జి.శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో బేగంబజార్ మార్కెట్ బంద్ కు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అదే ప్లేస్ లో ఉరినల్ కట్టి తీరుతామని వ్యాపారులు ధీమా వ్యక్తం చేశారు. దీంతో బేగంబజార్ లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ నిరాకరించారు పోలీసులు. సంఘటన స్థలానికి గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ చేరుకున్నారు. స్వచ్చందంగా బంద్ లో పాల్గొన్నారు వ్యాపారులు.