byసూర్య | Fri, Apr 03, 2020, 01:23 PM
లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలను, పేద ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో ఇటువంటి వారిని గుర్తించి కనీస అవసరాలను అందజేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ రోజు దాదాపు 900 మంది పేద ప్రజలకి, వలస కార్మికులకు దాతల సహకారంతో నిత్యావసర సరుకులను అందజేశారు. దాతల సహకారంతో 100 క్వింటాళ్ల బియ్యం, సరిపడా కూరగాయలు, పండ్లను పంపిణీ చేశారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ మంత్రి వీరికి సరుకులను అందజేశారు.