byసూర్య | Fri, Apr 03, 2020, 12:09 PM
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత-శ్రీధర్ పట్టణంలోని 10, 11వ వార్డుల్లో చౌకధరల దుకాణాల్లో లబ్దిదారులకు బియ్యం పోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలు ఆకలితో అలమటించవద్దని రాష్ట్రప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, తెల్లరేషన్ కార్డు కల్గిన లబ్దిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే అందరు లాక్డౌన్ నిబంధనలను పాటించి ఇండ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ చందు, 12వ వార్డు కౌన్సిలర్ శ్రీలత-రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.