byసూర్య | Fri, Apr 03, 2020, 11:38 AM
ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కే.పి.వివేకానంద్ గార్ల పిలుపు మేరుకు ‘కరోనా వైరస్‘ బాధితుల సహాయార్థం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన కోలన్ నవీన్ రెడ్డి తనవంతు బాధ్యతగా రూ.1, 00, 000/లక్ష ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , యూత్ లీడర్ ఆనంద్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారికి తన క్యాంపు కార్యాలయం వద్ద చెక్కును అందచేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ బాధితులను ఆదుకోవాలనే మంచి ఆలోచనతో దాతలు ముందుకు రావడం సంతోషకరమని, ఎంతో ప్రమాదకరంగా భావించే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఎవ్వరు బయటికి రావద్దని, ప్రభుత్వం చెబుతున్నట్లుగా అందరూ సామాజిక దూరం, పరిశుభ్రత పాటిస్తే ‘కరోనా వైరస్‘ ను అరికట్టవచ్చని అన్నారు.