ఫ్లాష్..ఫ్లాష్.. సంగారెడ్డి లో 6 కరోనా పాజిటివ్ కేసులు..!

byసూర్య | Thu, Apr 02, 2020, 03:25 PM

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు మరిన్ని పెరుగుతున్నాయి. సంగారెడ్డిలో కొత్తగా ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న తెలంగాణ మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి హుటాహుటిన సంగారెడ్డికి వెళ్లారు. అక్కడకు చేరుకున్న వెంటనే సంగారెడ్డి కలెక్టర్‌తో హరీశ్‌ రావు సమీక్ష నిర్వహించారు.


కరోనా పాజిటివ్‌ వచ్చిన ఆరుగురిని వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ ఆరుగురి కుటుంబాల సభ్యులను అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. వారు ఎవరెవరిని కలిశారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 100 దాటిన విషయం తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొత్త కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM