byసూర్య | Thu, Apr 02, 2020, 01:06 PM
జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ చర్లపల్లి జైలులో గుండెపోటుతో మృతిచెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని అరాక్ జిల్లాకు చెందిన మార్చి 31న వాజీద్ అలీ(56)(ఖైదీ నంబర్ 4492)కి మధ్యాహ్నాం సమయంలో గుండెపోటు వచ్చింది. గమనించి జైలు అధికారులు అలీని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వాస్తవానికి వాజీద్ అలీ ఉపాధి కోసం నగరానికి వచ్చి.. జహీరాబరాద్లో కూలీ పనులు చేసుకునే వాడని అధికారులు చెప్పారు. ఏడాది క్రితం బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్షపడడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా వారు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలో పెట్టినట్టు జైలర్ రామకృష్ణ పేర్కొన్నారు.