byసూర్య | Thu, Apr 02, 2020, 09:49 AM
కరోనా వైరస్ తో ఆపద సమయం వచ్చింది.. ఈ సమయంలో విలువైన సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బంది.. పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం.. మార్చి నెలకు సంబంధించి పూర్తి జీతాన్ని ఇవ్వాలని ముఖ్య మంత్రి కెసిఆర్ నిర్ణయించారు. అంతే కాదు.. వారికి ప్రోత్సహాకాలు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, వీరికి ఇంసెంటీవ్ ఎంత ఇవ్వాలి... ఏమేరకు ఇవ్వాలనే దానిపై రెండు, మూడు రోజుల్లో తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం వుంది. కాగా, మర్చి నెలకు సంబంధించి అన్ని శాఖల ఉద్యోగుల జీతాల్లో కొత్త పెడుతూ ఇప్పటికే సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.