byసూర్య | Wed, Apr 01, 2020, 09:18 PM
తెలంగాణ రాష్ట్ర ఉన్నత మండలి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తు ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎంసెట్, ఐసెట్, లాసెట్, ఈసెట్, ఎడ్ సెట్, పీజీ ఈసెట్, పీఈసెట్ల పరీక్షలను తెలంగాణ హాయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సెట్లకు సంబంధంచిన దరఖాస్తు తేదీలను ఇప్పటికే ప్రకటించారు. అయితే కరోనా కారణంగా విద్యార్దులు పూర్తిగా దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో ఉన్నత విద్యామండలి అన్ని సెట్స్ కు సంబంధించిన ఫీజులను ఎలాంటి లేట్ ఫీజు లేకుండా గడువు తేదీని ఏప్రిల్ 20 వరకు పొడిగిలస్తూ నిర్ణయం తీసుకుంది.