byసూర్య | Wed, Apr 01, 2020, 09:13 PM
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలోని గుజరాతీ స్కూల్ లో గుజరాతీ సేవా మండల్ ఆధ్వర్యంలో తయారు చేసిన ఫుడ్ ప్యాకెట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. గుజరాతీ సేవా మండల్ వారు సికింద్రాబాద్ ప్రాంతంలో ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని.. అలాగే ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు సలహాలు అనుసరించి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అనవసరంగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఇబ్బంది పడొద్దని అన్నారు. అత్యవసరం ఉంటే తప్ప ఇంట్లో నుండి బయటకు రావద్దని అన్నారు. వ్యాధి నిర్మూలనకు స్వీయ నియంత్రణ అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గన్ శ్యామ్, జనరల్ సెక్రటరీ జానకి భాయ్, జేసు భాయ్ పటేల్, దామోదర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.