byసూర్య | Wed, Apr 01, 2020, 03:42 PM
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. ఉద్యోగస్థుల జీతాల్లో కోతలు విధించి సమాజానికి కేసీఆర్ ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని డీకే అరుణ ప్రశ్నించారు. కరోనాపై పోరాడుతున్న ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చే బహుమానం ఇదేనా అంటూ డీకే అరుణ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చేసినట్లుగానే ప్రయివేట్ కంపెనీలు వారి ఉద్యోగులకు ఇచ్చే జీతాలను నిలిపివేస్తే ఎవరూ బాధ్యత వహిస్తారని డీకే అరుణ నిలదీశారు.