సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్

byసూర్య | Wed, Apr 01, 2020, 03:42 PM

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. ఉద్యోగస్థుల జీతాల్లో కోతలు విధించి సమాజానికి కేసీఆర్ ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని డీకే అరుణ ప్రశ్నించారు. కరోనాపై పోరాడుతున్న ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చే బహుమానం ఇదేనా అంటూ డీకే అరుణ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చేసినట్లుగానే ప్రయివేట్ కంపెనీలు వారి ఉద్యోగులకు ఇచ్చే జీతాలను నిలిపివేస్తే ఎవరూ బాధ్యత వహిస్తారని డీకే అరుణ నిలదీశారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM