byసూర్య | Wed, Apr 01, 2020, 02:25 PM
రాజేంద్రనగర్ శంషాబాద్ లో మద్యం దొరకక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసై పది రోజుల నుండి మద్యం లభించకపోవడంతో చెట్టుకు ఉరివేసుకుని ఘాతుకానికి పాల్పడ్డాడు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్ గూడా గ్రామానికి చెందిన మల్లేష్ యాదవ్ చెట్టుకు ఉరి వేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదం రేపింది. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.