byసూర్య | Wed, Apr 01, 2020, 01:58 PM
అక్రమ సంబంధాలు పచ్చటి కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. తాత్కాలిక సుఖం కోసం జీవిత భాగస్వాములను చంపేందుకు సైతం కొందరు వెనుకాడటం లేదు. కొందరైతే పిల్లలను సైతం పొట్టన పెట్టుకుంటున్నారు. వివాహ బంధం కంటే అక్రమ సంబంధమే ముఖ్యమని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజగా అక్రమ సంబంధానికి మరో ప్రాణం బలైపోయింది. వివాహ కట్టుబాట్లను కాలరాస్తూ ముగ్గురు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత.. ప్రియుళ్లతో కలిసి భర్తను చిత్రహింసలు పెట్టింది. వారి వేధింపులు తాళలేని ఆ అమాయకుడు మనస్తాపానికి గురై కరెంట్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని రాజ్కోట్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజ్కోట్లోని గాంధీరామ్ అనే ప్రాంతంలో ప్రహ్లాద్, ధన్భాయి మహేశ్వరి అనే దంపతులు నివసిస్తున్నారు. కూలి పనులు చేసే ప్రహ్లాద్.. రోజూ ఉదయం వెళ్తే రాత్రికే ఇంటికి వచ్చేవాడు. దీంతో రోజంతా ఒంటరిగా ఉండే మహేశ్వరి అదే ప్రాంతానికి చెందిన నర్సింహ, రవిశంకర్, మహేశ్ అనే ముగ్గురు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ముగ్గురు ప్రియుళ్లను రోజూ ఇంటికి రప్పించుకుని రాసలీలలు కొనసాగించేది. ఈ విషయం తెలుసుకున్న ప్రహ్లాద్ పద్దతి మార్చుకోవాలని భార్యను అనేకసార్లు హెచ్చరించాడు. దీంతో ఈ విషయాన్ని ఆమె తన ప్రియుళ్లకు చెప్పింది. ఆ ముగ్గురు కలిసి అతడిని నిత్యం వేధించడం ప్రారంభించారు. నువ్వు చేతగాని వాడివి కాబట్టే నీ భార్య మాతో అఫైర్ పెట్టుకుందని సూటిపోటి మాటలు అనేవారు. ఓ వైపు భార్య తన మాట వినకపోవడం, మరోవైపు ఆ ముగ్గురి వేధింపులతో ప్రహ్లాద్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
గ్రామంలో పరువు పోయాక బ్రతకడం అనవసరమని భావించి ఇంట్లోనే కరెంట్ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ప్లహ్లాద్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో మహేశ్వరి అక్రమ సంబంధాల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. దీంతో పోలీసులు మృతుడి భార్యతో పాటు ఆమె ముగ్గురు ప్రియుళ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.