byసూర్య | Wed, Apr 01, 2020, 12:53 PM
జ్వరం లేకపోతే కరోనా లేదని అనుకోవడానికి లేదని డాక్టర్ విశ్వనాథ్ తెలిపారు. దగ్గు, జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించాలి అని అన్నారు. లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. టీబీ ఉన్నవారికి కరోనా సోకితే చాలా ప్రమాదం అన్నారు. టీబీ ఉన్నవాళ్లు మెడిసిన్ లు వాడడం మానకూడదు అన్నారు. చిన్నపిల్లలు కచ్చితంగా శుభ్రత పాటించేలా చూడాలి. కరోనా ఉన్నవాళ్లు కచ్చితంగా క్వారంటైన్ ఉండాల్సిందే అని డాక్టర్ సోమరాజు తెలిపారు. గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి. జ్వరం రాకుండానే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ అని డాక్టర్ రాజీవ్ మీనన్ తెలిపారు.