byసూర్య | Wed, Apr 01, 2020, 11:01 AM
హైదరాబాద్ లో 254 వాహనాలతో 504 ప్రాంతాలలోని జంటనగరాలలో ప్రజలకు మొబైల్ రైతుబజార్ల ద్వారా కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉన్నాయని మంగళవారం మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కూరగాయలు కావాల్సిన కాలనీలు, అపార్ట్ మెంట్ల వాసులు, మొబైల్ రైతుబజార్లు నిర్వహించాలనుకునే యువకులు, ఉత్సాహవంతులు 7330733212 నెంబర్ కు వాట్సప్, ఫోన్ కాల్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.