byసూర్య | Wed, Apr 01, 2020, 10:40 AM
దిశ ఘటన తర్వాత హైదరాబాద్లో తీవ్ర సంచలనం సృష్టించిన చేవెళ్ల కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణంగా గుర్తించారు. సిక్కిం రాష్ట్రానికి చెందిన మహిళకు హైదరాబాద్ యువకుడితో పేస్ బుక్ లో పరిచయం ఏర్పడిందని దాంతో అతడిని కలవడానికి వచ్చిన మహిళను ప్రియుడు అతడి బంధువు తో కలిసి హత్యా చేసినట్టు గుర్తించారు. మహిళ మెడ లో ఉన్న ఆభరణాల ఆధారంగా ఆమె సిక్కిం రాష్ట్రానికి చెందిన మహిహగా గుర్తించారు. హంతకులు ఓ ట్రావెల్ సంస్థకు చెందిన కారును ఉపయోగించటంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు జరిపారు. కాగా మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలిపారు.