byసూర్య | Wed, Apr 01, 2020, 10:29 AM
చేవెళ్ల మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. దిశ ఘటన తర్వాత చేవెళ్ల హత్య కేసు హైద్రాబాద్ లో తీవ్ర సంచలనం సృష్టించింది.ఫెస్ బుక్ పరిచయమే హత్యకు కారణమని తెలుస్తుంది. హంతకుడు హైదరాబాద్ కు చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. బంధువుతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మహిళ సిక్కిం రాష్ట్రానికి చెందింది. మృతిదేహాన్ని తీసుకువచ్చిన ట్రావెల్స్ కారును పోలీసులు గుర్తించారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్య జరిగిన రోజే మహిళ నగరానికి వచ్చింది. సిక్కింలో మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వివాహిత సంబంధం నేపథ్యంలో హత్య చేశారు. మృతురాలి శరీరంపై ఉన్న ఆభరణాల ఆధారంగా దర్యాప్తు చేశారు.