byసూర్య | Wed, Apr 01, 2020, 09:29 AM
ఈఎంఐ చెల్లింపుదారులకు పెద్ద ఊరట లభించింది. ఈఎంఐలపై ఆర్బీఐ సూచనకు కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆమోదం తెలిపాయి. కోవిడ్- 19ను నియంత్రించడానికి ప్రధాని మోదీ ఏప్రిల్ 15 వరకు దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్ధికంగా వెసులుబాటు కల్పించడానికి ఆర్బీఐ ఈఎంఐలపై మూడు నెలలపాటు మారటోరియం విధించింది. ఈఎంఐలపై అంతిమ నిర్ణయాన్ని ఆర్బీఐ బ్యాంకులకే వదిలేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఈఎంఐలు మూడునెలల వరకు చెల్లించనవసరం లేదని పేర్కొన్నాయి. మార్చి 1 నుండి మే 31 వరకు మారటోరియం విధిస్తున్నట్లు పేర్కొన్నాయి.