హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా అల్లర్లకు కుట్ర

byసూర్య | Wed, Apr 01, 2020, 08:49 AM

సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగినట్లు అల్లర్లను హైదరాబాద్‌లోనూ సృష్టించాలని చూశారు కొందరు.. దానికోసం ఓ ప్రార్థన కేంద్రం వద్ద విధ్వంసక చర్యలకు కూడా ప్రయత్నించారు.. ఓ బస్సుకు నిప్పు పెట్టే ప్రయత్నమూ చేశారు.. అయితే, పోలీసుల అప్రమత్తతతో వారి కుట్ర భగ్నం అయ్యింది. వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌లోని రియాసత్‌నగర్‌కు చెందిన హర్షద్‌, బాబానగర్‌కు చెందిన అబ్దుల్‌ వసీ బాల్య స్నేహితులు. ఢిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల వీడియోలను చూసి ఇక్కడ కూడా గొడవలు సృష్టించాలని ప్లాన్‌ చేశారు. మాదన్నపేట్‌ ప్రాంతంలో ఇటీవల ఓ వర్గానికి చెందిన ప్రార్థన కేంద్రం వద్ద విధ్వంసకర చర్యలకు దిగారు. అంతకుముందే కంచన్‌బాగ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సుకు నిప్పంటించాలని చూశారు.


ఈ విషయం తెలిసిన పోలీసులు అప్రమత్తమై.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా దాడులకు పాల్పడింది.. వీరిద్దరేనని తేలింది. వీరిని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. మాదన్నపేట్‌, కంచన్‌బాగ్‌ ఘటనలతో పాటు చాంద్రాయణ గుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏటీఎంను కూడా ధ్వంసం చేసినట్లు ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారిస్తున్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM