ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కరోనా కోత...

byసూర్య | Tue, Mar 31, 2020, 03:48 PM

కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించిన దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిలకడగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థల, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల మార్చి నెల వేతనాల్లో కొంత మొత్తంపై కోత విధించనుంది. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. ఇలా కోత విధించిన మొత్తాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక వారికి తిరిగి చెల్లిస్తారని అధికార వర్గాల సమాచారం. ఈ జీవో ప్రకారం ఎవరి వేతనాల్లో ఎంత శాతం కోత విధిస్తామన్న వివరాలు స్పష్టం చేసింది.


- ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో- 75 శాతం  


- ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర  అఖిల భారత సర్వీస్ అధికారుల వేతనాల్లో- 60 శాతం 


- మిగతా అన్ని క్యాటగిరీ ఉద్యోగుల వేతనాల్లో- 50 శాతం


- అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో - 50 శాతం


- నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో- 10 శాతం


- నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో- 10 శాతం


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM