byసూర్య | Tue, Mar 31, 2020, 02:10 PM
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత పెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో జీతాల కోతపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీతాల కోత నుంచి డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను మినహాయించాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఏ రాష్ట్రంలో కోతలు విధించడం లేదని అన్నారు. కోతలపై ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ప్రభుత్వం చర్చించిందా? అని ఆయన ప్రశ్నించారు. పెన్షన్ డబ్బులతో బతికేవాళ్ళనూ ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. కోతల నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ పునరాలోచించాలని జీవన్రెడ్డి సూచించారు