byసూర్య | Tue, Mar 31, 2020, 01:41 PM
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తరిమికొట్టాలని మేడ్చల్ చైర్ పర్సన్ దీపికారెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్ణాపూర్ లో 250 మందికి మాస్కులు చైర్ పర్సన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, బయటికి వెళ్లితే తప్పని సరిగా మాస్కులు ధరించాలని దీపికారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తుడం గణేష్, కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు మర్రి నర్సింహారెడ్డి, శానిటేషన్ ఇన్స్ స్పెక్టర్ రాంచందర్ పాల్గొన్నారు.