byసూర్య | Tue, Mar 31, 2020, 01:07 PM
వలస కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యతని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం మొదటి విడతలో జిల్లా కేంద్రమైన సిద్ధిపేట- మందపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన డీఎక్స్ఎన్ పరిశ్రమ వద్ద ఉన్న క్యాంపులో 360 మంది, అలాగే నర్సాపూర్ డబుల్ బెడ్ రూమ్ వద్ద క్యాంపులో 320 మంది, అదే విధంగా గజ్వేల్ పట్టణ శివారు ముట్రాజ్ పల్లి క్యాంపులో 680 మందికి, మర్కుక్ లోని క్యాంపులో 300 మందికి, తునికి-బొల్లారం క్యాంపులో 600 మందికి మొదటి విడతగా ఏర్పాటు చేసిన క్యాంపులో ఆయన స్వయంగా వెళ్లి వలస కూలీలకు 12 కిలోల బియ్యం, రూ.500 రూపాయల నగదును మంత్రి చేతుల మీదుగా అందజేశారు.