byసూర్య | Tue, Mar 31, 2020, 12:27 PM
హైదరాబాద్ లో ’లాక్ డౌన్‘ ను పకడ్బందీగా అమలు చేయడానికి కేంద్ర బలగాలు వచ్చాయని తప్పుడు ప్రచారం చేసిన వారికి సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. లాక్ డౌన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బలగాలు వచ్చాయని సోషల్ మీడియాలో వైరల్ చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. సంగారెడ్డి నుండి పఠాన్ చేరువు మీదుగా 30 వాహనాల్లో హైదరాబాద్ నగరానికి కేంద్ర బలగాలు వచ్చాయని సోషల్ మీడియా వైరల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.