byసూర్య | Tue, Mar 31, 2020, 11:07 AM
కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా తెలంగాణ మోటర్ వెహికిల్స్ ఇన్స్ స్పెక్టర్ల అసోసియేషన్ రూ.1.5 కోట్ల విరాళం ప్రకటించింది. సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కు మోటార్ వెహికిల్స్ ఇన్స్ స్పెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కె. పాపారావు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.