byసూర్య | Tue, Mar 31, 2020, 11:04 AM
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భాష్యం స్కూల్స్ విద్యాసంస్థల ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, చైతన్య సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. సోమవారం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ తరుపున చెక్కు అందజేశారు.