byసూర్య | Tue, Mar 31, 2020, 10:55 AM
వైన్స్ షాపులు ఓపెన్ అంటూ జీఓ వైరల్ చేసిన వారికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తెలంగాణలో వైన్స్ షాపులు ఓపెన్ అంటూ ఎక్సైజ్ శాఖ పేరుతో నకిలీ జీఓను సోషల్ మీడియాలో వైరల్ చేసిన 5 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నాంపల్లి ఆఘపురాకు చెందిన అనూష్ కుమార్, బషీర్ బాగ్ కు చెందిన హనుమాన్ రాజులతో పాటు మరో ముగ్గురికి నోటీసుల ఇచ్చారు పోలీసులు.