byసూర్య | Tue, Mar 31, 2020, 10:52 AM
సికింద్రాబాద్ పరిధిలోని బన్సీలాల్ పేట మల్టీ ఫర్పస్ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలకు కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, సీపీ అంజనీ కుమార్ సరుకులు అందజేయనున్నారు. ఈ అవకాశాన్ని సద్వివినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.