byసూర్య | Mon, Mar 30, 2020, 04:36 PM
ఉప్పల్ జీహెచ్ఎంసీ స్టేడియంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణ శేఖర్ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గోపు సరస్వతి సదానంద్ మాట్లాడుతూ.. స్టేడియంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల సామాజిక దూరం పాటిస్తూ కూరగాయలు కొనుగోలు చేయడానికి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్ స్పెక్టర్ సుదర్శన్ , జీహెచ్ఎంసీ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు మహమ్ముద్, మాస శేఖర్,పాపి రెడ్డి పాల్గొన్నారు.