byసూర్య | Mon, Mar 30, 2020, 12:31 PM
కొత్తగూడెం జిల్లాలో ఎంపీటీసీపై హత్యాయత్నం.. కారుతో ఢీకొట్టిన నిందితులు
- ఇల్లెందు మండలం ఇందిరానగర్ ఎంపీటీసీని కారుతో ఢీకొట్టిన దుండగులు
- గాయాలతో తప్పించుకున్న ఎంపీటీసీ
- పరామర్శించిన ఎమ్మెల్యే బానుత్ హరిప్రియ
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఎంపీటీసీపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం జిల్లాలోని ఇల్లెందు మండలం ఇందిరానగర్ ఎంపీటీసీ మండల రాము మహేశ్ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న సమయంలో వెనక నుంచి కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆయన బైక్ను ఢీకొట్టారు. కారు ఢీకొనడంతో కిందపడి తీవ్రంగా గాయపడిన ఎంపీటీసీ భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.