byసూర్య | Mon, Mar 30, 2020, 12:13 PM
మంత్రి హరీశ్ రావుకు అల్విన్ కాలనీకి చెందని 70 ఏళ్ల వృద్ధురాలు కన్యాకుమారి లాక్ డౌన్ పరిస్థితుల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని ఫోన్ చేసి తన బాధ చెప్పింది. వెంటనే స్పందించిన మంత్రి అందుబాటులో ఉన్న టీఆర్ఎస్ నాయకుడు సంతోష్ రెడ్డికి విషయాన్ని తెలియజేశారు. మంత్రి హరీష్ రావు సూచనతో నిరుపేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి పెద్ద మనుసుతో నెలకు సరిపడా నిత్యవసర సరుకులను, అవసరమైన మెడిసిన్, ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మంత్రి హరీశ్ రావుకి, సంతోష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. సమస్య తెలిపిన వెంటనే గంటలోపే స్పందించి నాకు సహాయం చేసిన మీరు నాకు కొడుకులు లెక్క అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది.