byసూర్య | Mon, Mar 30, 2020, 12:06 PM
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్ నగరంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఆదివారం జూబ్లీహిల్స్ లోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో కలిసి ప్రజలకు శానిటైజర్లను ఉచితంగా పంపిణి చేశారు.