byసూర్య | Mon, Mar 30, 2020, 11:43 AM
హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గం నల్లకుంట డివిజన్ లోని నిరుపేదలకు తన వంతు సహాయంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు శ్రీనివాస్ గౌడ్. నల్లకుంట డివిజన్ పరిధిలో ఎవరైనా నిరుపేద కుటుంబం ఉంటే తన దృష్టికి తీసుకువెళ్లాలని బస్తీ పెద్దలను, స్థానిక యువకులను కోరారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తామే స్వయంగా నిరుపేదల ఇంటికి వెళ్లి నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తామని అన్నారు.