byసూర్య | Mon, Mar 30, 2020, 11:35 AM
హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. ఫలకనుమ పోలీస్ స్టేషన్ పరిధిలో 4వ అంతస్తు పై నుండి పడి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నవాబ్ సాబ్ కుంట ప్రాంతంలో మొహమ్మద్ జైన్ అనే వ్యక్తి భార్య, రెండేళ్ల కుమారుడుతో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 4వ అంతస్తు బిల్డింగ్ పై నుండి పడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫలకనుమ పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఫలకనుమ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.