ముంబైలో తెలంగాణ వాసుల అవస్థలు

byసూర్య | Sun, Mar 29, 2020, 02:55 PM

తెలంగాణ నుండి గత కొద్ది రోజుల క్రితం ముంబైకి వెళ్లిన వలస కూలీలు లాక్ డౌన్ సందర్బంగా తెలంగాణ కు రాలేక అక్కడే తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈరోజు ముంబై లోని భరత్ నగర్ లో పలువురు రోజు వారి కూలీలు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎలాగైనా ప్రత్యేక చొరవ తీసుకొని మమ్మల్ని ముంబై నుండి తెలంగాణ లోని మా జిల్లాలకు తరలించాలని పలువురు చేతులెత్తి వేడుకున్నారు. ఇక్కడ చిన్న చిన్న గదులలో 8 మందికి పైగా ఇబ్బందులు పడుతూ ఉంటున్నామని.. మాకు రోజు వారి ఖర్చులకు కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులలో ఉన్నామని వారు వేడుకున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా వ్యాధి తీవ్రమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఇక్కడున్న వందలాది తెలంగాణ వారిని తీసుకెళ్లాలని వారు ప్రాధేయపడ్డారు. వీరిలో ఉమ్మడి వరంగల్ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన పలువురు రోజు వారి కూలీలు ఉన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM