byసూర్య | Sun, Mar 29, 2020, 02:52 PM
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే తన నియోజకవర్గ పరిధిలో 1000 మందికి స్వయంగా తానే వంటచేసి వారికి పెడుతున్నారు. దగ్గరుండి వారికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాదు తన నియోజకవర్గమైన గోశామహల్ లో ఎవరు కూడా ఆకలితో బాధ పడకూడదని ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి ఎవరు ఇక్కడికి వచ్చినా తనను సంప్రదించాలని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇతర రాష్ట్రాల వారికి రేషన్ కార్డు ఉండదు.. కాబట్టి వారికి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని తను చూసుకుంటానాని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రజలకు హామీ ఇచ్చారు.