byసూర్య | Sun, Mar 29, 2020, 12:11 PM
తెలంగాణలో ఆదివారం మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 నిమిషాల వరకు వైన్స్ షాపులు తెరిచి ఉంటాయని ఓ సర్క్యూలర్ వైరల్ అవుతుంది. ఇది తెలంగాణ ఎక్సైజ్ శాఖ జారీ చేసిన ఉత్వర్వులు అంటూ ఆ న్యూస్ సోషల్ మీడియలో హల్చల్ చేస్తుంది. ఇది నిజమే అనుకున్న మందు బాబులు దానిని తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ ఫేక్ సర్క్యూలర్ తయారు చేసిన వారి పై కేసు పెట్టేందుకు ఆబ్కారీ అధికారులు సిద్దమవుతున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ వారు హెచ్చరిస్తున్నారు.