byసూర్య | Sat, Mar 28, 2020, 06:00 PM
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తునట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఔటర్ పై రద్దీ లేదు. కానీ కొంత మంది కళ్లుగప్పి రోడ్డు పై అతి వేగంగా ప్రయాణిస్తున్నారు. శనివారం ఉదయం బోలేరో,లారీ ఢీకొనడంతో ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కాలం వరకు ఔటర్ రింగ్ రోడ్డును మూసివేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.