byసూర్య | Sat, Mar 28, 2020, 04:05 PM
హైదరాబాద్ లో ఎక్కడ కూడా రెడ్ జోన్ ప్రకటించలేదని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి స్పష్టం చేశారు. కొంత మంది కావాలని మార్ఫింగ్ లు చేసి బ్యానర్లు పెడుతున్నారని, వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోకాపేట,చందానగర్,గచ్చిబౌలి,తుర్కయంజాల్,కొత్తపేట ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని సీఎం సూచించారని, ఆయన రెడ్ జోన్ గా ఈ ప్రాంతాలను ప్రకటించలేదన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారి పై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు.