byసూర్య | Sat, Mar 28, 2020, 02:33 PM
ప్రమాదవశాత్తు పూరి గుడిసెలు దగ్ధమైన సంఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలం అహ్మద్ మోడీ అపార్ మెంట్ లో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మద్ గూడ మోడీ అపార్ మెంట్ కట్టడానికి వచ్చిన వలస కూలీలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. శనివారం ఒక్క సారిగా ప్రమాదవశాత్త గూడిసెలకు మంటలు వ్యాపించాయి. గమనించిన కూలీలు గుడిసెలోంచి పరుగులు తీశారు. ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అర్పివేశారు. గూడిసెలో కార్మికుల వస్తువులు పూర్తిగా కాలిపోయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పిచ్చుకున్నారు.