కరోనాకి చెక్ పెట్టేందుకు సర్కార్ కీలక నిర్ణయం

byసూర్య | Sat, Mar 28, 2020, 01:37 PM

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 59కి చేరడంతో సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారికి జియో ట్యాగింగ్ ఇవ్వబోతున్నారు. దీని ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారి చేతికి బ్యాండ్ వేస్తారు. దానికి ఓ నంబర్ ను ఇస్తారు. అది జీపీఎస్ లోకేషన్ తో పని చేస్తుంది. దాని ద్వారా వారు ఎక్కడికి వెళ్లినా జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించవచ్చు. విదేశాల నుంచి వచ్చిన వారు, క్వారంటైన్ లో ఉన్న వారు తాము ఉన్న ప్రాంతం నుంచి 50 మీటర్ల దూరం వెళితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూంకి మెసేజ్ పోతుంది. దాంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారు. దీనికి సంబంధించి ప్రత్యేక యాప్ ను తయారు చేశారు. ఏపీలో ఇప్పటికే ఇలాంటి యాప్ అమల్లో ఉంది. ఇప్పుడు తెలంగాణలో అమలు చేయనున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM