byసూర్య | Sat, Mar 28, 2020, 01:10 PM
కరోనా వ్యాప్తి చెందకుండా అత్యవసర సేవలు మినహా.. అంతాఇంటికే పరిమితం కావాలని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. లాక్ డౌన్ ప్రకటించాయి. కొందరు విధిగా ఇది ఫాలో అవుతుండగా.. మరికొందరు పని లేకున్నా రోడ్డు ఎక్కుతున్నారు. అక్కడక్కడా పోలీసులు లాఠీలకు పని చెప్పాలిసిన పరిస్థితి ఎదురయ్యాయి. మరికొన్ని చోట్ల పోలీసులపైకి తిరగబడిన ఘటనలు కూడా లేక పోలేదు. దీంతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఆ బలగాలు హైదరాబాద్ చేరుకున్నాయి. వాళ్ళు మన పోలీసులంతా సాఫ్ట్ కాదు... మరి చూసి రోడ్ ఎక్కితే మంచిది.ఇండ్లకే పరిమితం అవ్వండి అని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వ అధికారులు.