byసూర్య | Fri, Jan 17, 2020, 07:09 PM
చైనాలోని ప్రముఖ పెద్ద పట్టణం షాంఘైలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. షాంఘై తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకల నిర్వహణ జరిగింది. భారత కాన్సూలేట్ జనరల్ అనిల్కుమార్ రాయ్ కుటుంబ సభ్యులతో వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక తెలుగు ప్రజలతో పాటు ఇతర ప్రముఖ వ్యక్తులు వేడుకకు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాంస్కృతిక వేడుకల నిర్వహణ, సాంప్రదాయ వంటకాల వడ్డన, కబడ్డీ, పతంగుల ఎగురవేత, ముగ్గుల పోటీల నిర్వహణ ఇలా తెలుగుదనం ఉట్టిపడేలా సంబరాలను ఘనంగా నిర్వహించారు. అందరూ ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికులు సైతం వేడుకలో పాల్గొని తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రశంసించారు.